gran parchasegran parchase
0 0
Read Time:2 Minute, 23 Second

Grans Parchase:ఏలూరు, మార్చి, 7: ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో అపరాలు– మినుములు మరియు పెసలు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు.

శుక్రవారం స్ధానిక జెసి ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షలో సిఎంఎపిపి లో రైతుల నమోదును నూరుశాతం పూర్తిచేయాలన్నారు. గుర్తించిన కొనుగోలు కేంద్రాల్లో భధ్రత, తూకాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. పెసలు క్వింటాకు రూ. 8682/-లు, మినుములు క్వింటాకు రూ.7400/-లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లాలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాలలో ఈ పంట నమోదు చేసుకున్న రైతుల నుండి మినుములు, పెసలు మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు సమీపంలోని రైతు సేవా కేంద్రాలలో నేటి నుండి సిఎంఎపిపి ద్వారా రైతుల పేర్లు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. తేమ శాతం 12% లోపు ఉండాలని మరియు రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, ఏ.పి. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ సిహెచ్ ప్రసాద్ గుప్తా, మార్కెటింగ్ అధికారి వి. మహేంధ్రనాద్, డిసిఎంఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *